ఆంధ్రప్రదేశ్లోని ఎస్ఐ నియామక ప్రక్రియపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. అభ్యర్థుల ఎత్తు కొలిచే విషయంలో అన్యాయం జరిగిందంటూ కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు నియామక ప్రక్రియపై సింగిల్ బెంచ్ జడ్జి స్టే విధించడం జరిగింది. ఈ స్టేను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం మరోసారి పిటిషన్ దాఖలు చేసింది.
ఎస్ఐ నియామక ప్రక్రియలో ఎత్తు కొలిచే విధానంపై పలువురు అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఆర్ఎస్ఐగా పనిచేసిన అభ్యర్థిని కూడా ఎత్తు సరిపోలేదంటూ పక్కకు తప్పించారని ఆరోపిణ చేయడం జరిగింది. దీనిపై అభ్యర్థుల తరపున న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీంతో అభ్యర్థుల ఎత్తు విషయంలో తామే నిర్ణయం తీసుకుంటామంటూ ప్రతి అభ్యర్థిని హైకోర్టుకు రావాల్సిందిగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించడం జరిగింది. దీనికి అనుగుణంగా అందరి అభ్యర్థుల తరపున న్యాయవాది జడ శ్రావన్ కుమార్ ప్రమాణ పత్రం పిటిషనర్ల తరపున దాఖలు చేశారు. దీంతో పిటిషనర్లు అందరూ సోమవారం కోర్టుకు హాజరు కావాల్సిందిగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.









