తెలంగాణప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ పథకంపై కీలక అప్‌డేట్

తెలంగాణప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ పథకంపై కీలక అప్‌డేట్ వచ్చింది. రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం మహిళలు తమ ఆధార్ కార్డును చూపించి జీరో టికెట్ పొందుతుండగా, ఇకపై ఆ అవసరం లేకుండా ప్రత్యేక ‘స్మార్ట్ కార్డులను’ జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది.

స్మార్ట్ కార్డుల జారీ – ప్రత్యేకతలు

ప్రభుత్వం అందించబోయే ఈ స్మార్ట్ కార్డులు చూడటానికి ఏటీఎం లేదా డెబిట్ కార్డు తరహాలో ఉంటాయి. ఇందులో భద్రత కోసం ఒక ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ చిప్‌ను అమరుస్తారు.

లబ్ధిదారులైన మహిళల ఆధార్ వివరాలు, వారి ఫోటోను సేకరించి ఈ చిప్‌తో లింక్ చేస్తారు. బస్సులో ప్రయాణించేటప్పుడు కండక్టర్లు ఈ స్మార్ట్ కార్డును స్కాన్ చేసి నేరుగా ఉచిత టికెట్లను జారీ చేస్తారు. దీనివల్ల సమయం ఆదా అవుతుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు