కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో.. ఎన్నికల సంఘం ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. తాజాగా, ఎన్నికలకు ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఖరారు చేసింది. 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర అధికారులు పంపిన ప్రతిపాదనలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోద ముద్ర వేసింది.

 

 

దీనితో ఆయా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌లో అత్యధికంగా 14 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా మిగిలిన 13 నియోజకవర్గాలకు విడిగా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలో 4, మిగిలిన జిల్లాల్లో ఒక్కొటి చొప్పున ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్ంగా 2,290 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలుచుండగా 59,779 బ్యాలెట్ యూనిట్లను (BU) సిద్దం చేయాలని ఎన్నికల కమీషన్ ఆదేశించింది. మరోవైపు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్‌లను (VIS) అందజేయడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 3,26,02,799 స్లిప్‌లలో 1,65,32,040 మంది ఓటర్లకు పంపిణీ చేశారు, ఇది దాదాపు 51 శాతం. నవంబర్ 23 నాటికి మొత్తం స్లిప్సుల పంపిణీ పూర్తవుతుందని భావిస్తున్నారు.

 

రూ.632 కోట్లు స్వాధీనం..

ఎన్నికల సంఘం (ఈసీఐ) గత రెండు నెలలుగా వివిధ రూపాల్లో రూ.632 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. వీటిలో మొత్తం నగదు స్వాధీనం రూ.236.35 కోట్లుగా ఉంది మద్యం విషయానికొస్తే, అక్టోబర్ 9, 2023 నుండి నవంబర్ 20, 2023 వరకురూ.101.57 కోట్లు. డ్రగ్స్/నార్కోటిక్స్ స్వాధీనంరూ. 35.06 కోట్లుగా ఉన్నాయి.విలువైన లోహాల స్వాధీనం రూ. 181.05 కోట్లకు చేరింది. బియ్యం, కుక్కర్లు, చీరలు, వాహనాలు, గడియారాలు, మొబైల్‌లు, ఫ్యాన్‌లు, కుట్టు మిషన్లు, అనుకరణ నగలు మరియు ఇతర వస్తువులను రూ.78.70 కోట్లకు మేరకు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద అక్టోబర్ 9, 2023 నుండి నవంబర్ 20, 2023 వరకు స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ రూ. 6,32,74,73,364గా తేలింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు