హైదరాబాద్‌లో విషాదం.. భవనం పైనుంచి దూకి మెడికో ఆత్మహత్య

హైదరాబాద్‌లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న 18 ఏళ్ల కె. భరద్వాజ్ రెడ్డి నిర్మాణంలో ఉన్న ఓ భవనం పైనుంచి దూకి మృతి చెందినట్లు సమాచారం. భవిష్యత్తులో వైద్యుడిగా స్థిరపడాల్సిన యువకుడు అకాల మరణానికి గురికావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

భరద్వాజ్ రెడ్డి ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు సమాచారం. ఈ ఘటనతో కళాశాలలోనూ విషాద వాతావరణం నెలకొంది. తోటి విద్యార్థులు, అధ్యాపకులు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. యువకుడి మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు