కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  జబర్దస్త్ జడ్జిగా రామ్ గోపాల్ వర్మ హీరోయిన్…అసలు ఊహించి ఉండరు..!

జబర్దస్త్ జడ్జెస్ గా వీరు ఏళ్ల తరబడి పనిచేశారు. హాస్య ప్రియులకు నవ్వుపూయించారు. 2013లో జబర్దస్త్ ప్రయోగాత్మకంగా మొదలై ఇంకా సక్సెస్ఫుల్ గా సాగుతుంది. రోజా, నాగబాబు తర్వాత అనసూయ కూడా షో నుండి వెళ్ళిపోయింది. సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను సైతం జబర్దస్త్ కి దూరం అయ్యారు. ఇక జడ్జెస్ విషయానికి వస్తే… నాగబాబు స్థానంలో కొన్నాలు మను కొనసాగారు. అలీ కూడా ఆ సీట్లో కూర్చున్నారు. మను మాత్రమే కొన్నాళ్ల పాటు పని చేశారు.

 

ఆయన తప్పుకున్నాక కమెడియన్ కృష్ణ భగవాన్ వచ్చారు. కొన్నాళ్లుగా ఆయనే జబర్దస్త్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇక రోజా స్థానంలోకి మీనా, ఆమని, ఇంద్రజ ఇలా పలువురు హీరోయిన్స్ వచ్చారు. ఎవరూ ఆమె స్థాయిలో సక్సెస్ కాలేదు. కొన్నాళ్లుగా నటి కుష్బూ జబర్దస్త్ జడ్జిగా వ్యవహరిస్తోంది. తాజాగా ఆమె స్థానంలోకి ఒకప్పటి హీరోయిన్ మహేశ్వరి వచ్చింది.

 

మహేశ్వరి పేరు చెబితే హీరో జేడీ చక్రవర్తితో చేసిన గులాబీ, దెయ్యం చిత్రాలు గుర్తుకు వస్తాయి. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన గులాబీ అప్పట్లో యూత్ ని ఊపేసింది. వర్మ తెరకెక్కించిన దెయ్యం కూడా సూపర్ హిట్. పెళ్లి, ప్రియరాగాలు వంటి హిట్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. సడన్ గా ఆమె జబర్దస్త్ జడ్జి సీట్లో ప్రత్యక్షం అయ్యింది. 2000 తర్వాత మహేశ్వరి సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. మహేశ్వరి కొన్నాళ్లు కొనసాగుతారా లేక కేవలం కొన్ని వారాలకేనా? అనేది చూడాలి…

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు