కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  పోలింగ్ కేంద్రంలో ఈ పని చేస్తే అరెస్ట్ తప్పదు!!

రేపు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల పండుగ జరగబోతుంది. ఎన్నికల పండుగకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఓటర్లు రెడీ అవుతున్నారు. అయితే ఈసారి కొత్త ఓటర్లు మాత్రం రెట్టించిన ఉత్సాహంతో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈసారి ఓటర్లుగా ఎన్ రోల్ చేసుకున్న యువత తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్న ఆనందంలో ఉన్నారు.

 

తొలిసారిగా ఓటు హక్కును ఉపయోగించుకునే వారు ఓటు వేసే విషయంలో చాలా ఉత్సాహంగా ఉంటారు. యువతీ యువకులు తాము ఓటు వేసి, తాము ఓటు హక్కును వినియోగించుకున్నామని చెప్పే ప్రయత్నంలో భాగంగా పోలింగ్ కేంద్రాల వద్ద సెల్ఫీలు తీసుకుంటూ హడావిడి చేస్తూ ఉంటారు. తమ వేలికి వేసి ఉన్న సిరా చుక్కను చూపెడుతూ ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు.

 

ఓటు వేసే సమయంలో ఫోటో దిగాలి అనుకునే ప్రబుద్ధులు కూడా ఉంటారు. అంతేకాదు విఐపిలు ఓటు వేస్తుంటే, పోలింగ్ కేంద్రాల వద్ద విఐపిలు వస్తే వారిని కూడా సెల్ ఫోన్లలో క్లిక్ మనిపించే వాళ్ళు లేకపోలేదు. అయితే ఈ క్రమంలో తాజాగా ఎన్నికల కమిషన్ విధించిన ఆంక్షలు కొత్త ఓటర్లను నిరుత్సాహానికి గురి చేస్తున్నాయి.

 

ఓటు వేసేందుకు వెళ్లే ఓటర్లు పోలింగ్ సెంటర్లోకి సెల్ ఫోన్ తీసుకు వెళ్ళడానికి అనుమతి లేదు. అంతేకాదు సెల్ఫీ తీసే ప్రయత్నం చేస్తే అరెస్టు చేసే ఛాన్స్ కూడా ఉంటుందని, ఇక ఆ ఓటు లెక్కించరని చెబుతున్నారు. పోలింగ్ కేంద్రంలో కెమెరాలతో కూడా ఎవరూ ఫోటోలు తీయకూడదని సూచిస్తున్నారు.

 

ఇక ఈ క్రమంలో పోలింగ్ కేంద్రాలకు సెల్ ఫోన్ అనుమతించబోమని ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో సెల్ఫీ ప్రియులకు ఈసీ షాక్ ఇచ్చినట్లు అయింది. యంగ్ ఓటర్ లు తాము ఓటు వేసినట్టు సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం మంచిదే .. దీనివల్ల మిగతా వారిలో కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలనే చైతన్యం వస్తుంది. అయితే పోలింగ్ కేంద్రాల వద్దకు ఫోన్లను అనుమతిస్తే మాత్రం వారితో తలనొప్పే అని భావించిన ఎన్నికల సంఘం ఈ నిబంధనలను విధించింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు