కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  హైదరాబాద్‌కు కాంగ్రెస్ అభ్యర్థులు.. అధిష్టానం అలెర్ట్..

తెలంగాణలో కాంగ్రెస్ దే అధికారమని ప్రీపోల్ సర్వేలు స్పష్టం చేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ హస్తం పార్టీదే హవా అని తేల్చేశాయి. ఇప్పుడు కాంగ్రెస్ మేజిక్ ఫిగర్ ను దాటి ఎన్ని సీట్లు ఎక్కువ వస్తాయన్న దానిపైనే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధిష్టానం కూడా అప్రమత్తం అయ్యింది.

 

ఆదివారం తెలంగాణలో 49 కౌంటింగ్‌ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇందుకోసం ఏఐసీసీ ప్రత్యేక పరిశీలకుల నియమించింది. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం అభ్యర్థులను హైదరాబాద్‌ రప్పించాలని యోచిస్తోంది.

తాజ్‌ కృష్ణలో అభ్యర్థులకు దిశానిర్దేశం చేయాలని ఏఐసీసీ ప్రతినిధులు భావిస్తున్నారు. హైదరాబాద్‌కు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ రానున్నారు. మరోవైపు టీకాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ జూమ్ మీటింగ్ లో మాట్లాడనున్నారు.

 

ఎన్నికల ఏజెంట్‌కే ఎమ్మెల్యే ధ్రువపత్రం ఇవ్వాలని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. ఈ విషయంపై వికాస్‌రాజ్‌ కు కాంగ్రెస్‌ నాయకులు విజ్ఞప్తి చేశారు. అయితే అలాంటి వెసులుబాటు ఏదీ లేదని ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ స్పష్టం చేశారని తెలుస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు