కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  డీ-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించిన భద్రాచలం డీఎస్‌పీ అరుణ్ కుమార్…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
డీఎస్పీ కార్యాలయం, భద్రాచలం

డీ-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించిన భద్రాచలం డీఎస్‌పీ అరుణ్ కుమార్.
భద్రాచలం జూన్ 10
టుడే 10 ప్రతినిధి

భద్రాచలం డివిజన్ డిఎస్పి సిబ్బందితో కలిసి ఈ రోజు భద్రాచలంలోని స్థానిక డీ-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడి, మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
మాదక ద్రవ్యాలు, మద్యం మరియు ఇతర మత్తు పదార్థాలకు బానిస కావడం వల్ల వ్యక్తిగత ఆరోగ్యం క్షీణించడమే కాకుండా, కుటుంబ జీవితం ముక్కలవుతుందని సమాజంలో గౌరవం పోతుందని హెచ్చరించారు.చికిత్స పూర్తి చేసుకున్న తర్వాత బాధితులు పాత అలవాట్లను పూర్తిగా విస్మరించాలని, ఆత్మవిశ్వాసంతో సమాజంలో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, తమ బంగారు భవిష్యత్తు కోసం విద్య, ఉపాధి కుటుంబ బాధ్యతలపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా డీ-అడిక్షన్ సెంటర్ ప్రాంగణంలో డీఎస్‌పీ సీఐ తమ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో సీఐ నాగరాజు, పోలీస్ సిబ్బంది, డీ-అడిక్షన్ సెంటర్ నిర్వాహకులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు