అయోధ్యలో బయటపడ్డ మరో ఇంజినీరింగ్ మార్వెల్
అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ (ADA) భవనంలో కుప్పకూలిన మెట్లు
అయోధ్యలో మరో ఇంజనీరింగ్ వైఫల్యం బయటపడింది అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ భవనం మెట్లు కుప్పకూలిపోయాయి…ఈ ఘటన జరిగినప్పుడు ఎమ్మెల్యే వేద్ ప్రకాశ్ గుప్తా, మేయర్ మహంత్ గిరిష్ త్రిపాఠి అక్కడే ఉన్నట్టు సమాచారం…అయితే.. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో జన ఊపిరి పీల్చుకున్నారు.
కాగా అంతకుముందే ఈ భవనంలో నిర్వహించిన ఓ మీటింగ్లో పాల్గొనేందుకు కోచింగ్ & లైబ్రరీ ఆపరేటర్స్ భారీ సంఖ్యలో వచ్చారు.సమావేశం ముగిసిన కొద్దిసేపటికే మెట్లు కుప్ప కూలడం గమనార్హం. నాసిరకం నిర్మాణాలు చేస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పుతెస్తారా అంటూ సర్కార్పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.. బీజేపీ చెప్పిన వికాస్ ఇదేనా? అంటూ జనం మండిపడుతున్నారు.









