ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు శుభవార్త అందించింది. మహిళలను కేవలం కూలీ స్థాయి నుంచి ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘PMFME–స్త్రీనిధి’ అనుసంధాన పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఈ పథకం ద్వారా అర్హులైన డ్వాక్రా మహిళలకు ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించనున్నారు. చిన్న స్థాయి ఆహార ప్రాసెసింగ్ వ్యాపారాలను ప్రారంభించేందుకు అవసరమైన పెట్టుబడి సమకూర్చడంతో పాటు మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
ఈ పథకం అమలుతో గ్రామీణ ప్రాంతాల్లోని డ్వాక్రా మహిళలు సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి ఆదాయం పొందే అవకాశం కలుగుతుంది. మహిళల ఆర్థిక స్వావలంబనను పెంచడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాల కల్పనకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.









