తిరుమలలో గురువారం నుంచి నిరంతరాయంగా శ్రీనివాస విశేష హోమం జరుగుతుందని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి పేర్కొన్నారు. శ్రీనివాస హోమంలో వర్చువల్గా పాల్గొనేందుకు అవకాశం ఉన్నట్లు తెలిపారు. టీటీడీలో త్వరలో సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు.. అలాగే ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులు భర్తీ చేస్తామని ఆయన ప్రకటించారు.









