మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలి… ఎమ్మెల్యే

ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు,ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ పోదెం వీరయ్య.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నవంబర్ 23
టుడే 9 ప్రతినిధి

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత చీరల పంపిణీ పథకంలో భాగంగా అందిస్తున్న చీరలను ప్రతి ఒక్క మహిళకు చేర్చాలని, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తెలియజేశారు. ఆదివారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ డి ఆర్ డి ఏ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి పేరిట చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ శ్రీ పొదెం వీరయ్య.రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిరుపేద మహిళలకు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి పేరిట చీరల పంపిణీ కార్యక్రమం చేయడం అభినందనియమని అన్నారు. రాష్ట్రంలోని చేనేత కార్మికులచే తయారు చేయబడిన చీరలను రాష్ట్ర మహిళలకు అందజేయడం శుభపరిణామని వ్యాఖ్యానించారు. మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మంచి పథకాలను అందిస్తుందని,వాటిని వినియోగించుకొని అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా తెలియజేశారు.అనంతరం స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రాష్ట్ర అటవీ అభివృద్ధి చైర్మన్ పొదెం వీరయ్య లను భద్రాద్రి మహిళా సమాఖ్య ఓబీ సభ్యులు శాలువాతో సన్మానించారు.


ఈ‌ కార్యక్రమంలో ఇందిరా మహిళా క్రాంతి ఏపీఎం, సీసీలు, డ్వాక్రా మహిళలు కాంగ్రెస్ పార్టీకి చెందిన మండల నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram