మంత్రివర్గంలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి?

* మంత్రి జూపల్లిని తప్పించే అవకాశం?

*కొండాసురేఖ ప్లేస్ లో ఉత్తమ్ పద్మావతి?

రాష్ట్రంలో మంత్రివర్గ మార్పు తప్పదా ? అంటే అవుననే సమాధానం కొన్ని వర్గాల నుండి వినవస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనున్నట్లు మాటలు వినవస్తున్నాయి. ఇది ఇంకో వారం పది రోజుల్లో జరగనున్నట్లు రాజకీయ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి… ఇందులో భాగంగా నలుగురు లేదా ఐదుగురు మంత్రుల్ని తప్పించే అవకాశం లేకపోలేదనే… గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి…. క్యాబినెట్ మంత్రిగా కొనసాగుతున్న …కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏఐసీసీలోకి తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలియ వచ్చింది. రవాణా శాఖామంత్రి పొన్నం స్థానంలో మహేశ్ కుమార్ గౌడ్ కు చోటు కల్పించనున్నారు అని కొందరు నేతల నుండి మాటలు వినవస్తున్నాయి.. కాగా మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఛాన్స్ కల్పించనున్నట్టు తన పేరు చెప్పటానికి ఇష్టపడని ఒక నాయకుడు తెలియజేశారు. టిపిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ స్థానంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును తీసుకొని ,పీసీసీ చీఫ్ గా హోంమంత్రిగా అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు సమాచారం అందుతోంది.ఇది ఇలా ఉంటే కేవలం పుకార్లు మాత్రమేనా లేక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనేది కార్యరూపం దాల్చుతుందా అనేది వేచి చూడాల్సి ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share