యాక్షన్ హీరో గోపీచంద్ తన 34వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ద్వారా ప్రముఖ ఫైట్ మాస్టర్ వి.వెంకట్ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ ఎపిక్ యాక్షన్ డ్రామాను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్కు సంబంధించి విడుదలైన అనౌన్స్మెంట్ పోస్టర్ మైథిక్ టోన్తో అందరినీ ఆకట్టుకుంటోంది. మండిపోతున్న ఆకాశం, రాతి శిఖరంపై నిలబడిన నల్ల చిరుతపులి వంటి అంశాలతో ఒక పవర్ఫుల్ ప్రపంచాన్ని పోస్టర్ పరిచయం చేస్తోంది. ఈ చిత్రం ముడి శక్తి మరియు ఉత్కంఠభరితమైన యాక్షన్తో నిండి ఉంటుందని చిత్ర బృందం స్పష్టం చేస్తోంది.
ఈ భారీ చిత్రానికి టాలీవుడ్లోని అత్యుత్తమ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. శామ్ సి.ఎస్. సంగీతాన్ని సమకూరుస్తుండగా, శామ్దత్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్గా, రామకృష్ణ-మోనిక ప్రొడక్షన్ డిజైనర్లుగా ఎంపికయ్యారు. రేపు (ఆదివారం) ఈ సినిమా పూజా కార్యక్రమాలతో పట్టాలెక్కనుంది.









