‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ డైలాగ్తో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు పృథ్వీరాజ్ తాజాగా మూవీ ప్రమోషన్స్ విధానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల చిత్ర పరిశ్రమలో ప్రచారాల పేరిట జరుగుతున్న కొత్త ట్రెండ్ను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. తాజాగా జరిగిన ‘రిస్క్’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, ప్రస్తుత కాలంలో నిర్మాతలు, హీరోలు అనుసరిస్తున్న పబ్లిసిటీ వ్యూహాలపై తన అసంతృప్తిని వెళ్లగక్కారు.
ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ సినిమా ప్రమోషన్స్ అంటూ భారీగా ఖర్చు చేస్తూ, కాలేజీల చుట్టూ తిరుగుతూ స్టూడెంట్స్ను కలుస్తున్నారని పృథ్వీరాజ్ పేర్కొన్నారు. అయితే అక్కడ కేవలం గోల, ఈలలు, అరుపులు మాత్రమే వినిపిస్తున్నాయని, ఆ హడావుడి ముగిసిన తర్వాత ఒక్క విద్యార్థి కూడా థియేటర్ కి వచ్చి సినిమా చూడటం లేదని ఆయన తన వ్యక్తిగత అభిప్రాయాన్ని బలంగా నొక్కి చెప్పారు. కాలేజీలకు వెళ్లడం వల్ల సమయం, డబ్బు మాత్రమే వృథా అవుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.
అందుకే కాలేజీలకు వెళ్లి ప్రమోషన్ల పేరిట డబ్బును వృథాగా తగలెయ్యద్దని, దానికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాలని చిత్ర పరిశ్రమకు పృథ్వీరాజ్ హితవు పలికారు. ఆ అనవసరపు ఖర్చుకు బదులుగా డిజిటల్ ప్లాట్ఫామ్లను సరైన పద్ధతిలో ఉపయోగించుకోవాలని సూచించారు. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ద్వారానే సినిమాను ప్రజల్లోకి విస్తృతంగా మరియు వేగంగా తీసుకెళ్లవచ్చని ఆయన ఈ సందర్భంగా సలహా ఇచ్చారు.









