ఆగస్టు 15 అనగానే ప్రతి భారతీయుడి గుండెల్లో దేశభక్తి ఉప్పొంగుతుంది. శతాబ్దాల పరాధీనత సంకెళ్లను తెంచుకుని స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న మహోజ్వల దినమిది. 2026 ఆగస్టు 15న భారతదేశం 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఎంతో గర్వంగా, ఘనంగా జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా జాతీయ జెండాలను ఎగురవేసి, వివిధ కార్యక్రమాలతో స్వాతంత్య్ర సంబరాలు నిర్వహిస్తున్నారు.
1947 ఆగస్టు 15న భారత్ బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్రం పొందింది. స్వతంత్ర భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆగస్టు 15న దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా మారింది.
స్వాతంత్య్రం కోసం పోరాడిన ఎందరో మహనీయులు, అమరవీరుల త్యాగాల ఫలితమే నేటి స్వేచ్ఛా భారతం. అందుకే స్వాతంత్య్ర దినోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదు.. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను స్మరించుకునే పవిత్రమైన ఘట్టం. వారి స్ఫూర్తితో దేశ అభివృద్ధి, ఐక్యత, సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఈ రోజు గుర్తుచేస్తుంది.









