బీహార్‌లో BPSC విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తం.. వాటర్ క్యానన్లతో నిరసనకారుల అడ్డగింత

బీహార్‌లో 70వ BPSC పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన మంగళవారం ఉద్రిక్తంగా మారింది. పాట్నాలోని గాంధీ మైదాన్ నుంచి రాజ్‌భవన్ వైపు పెద్ద సంఖ్యలో విద్యార్థులు మార్చ్ నిర్వహించారు. పరీక్షలో అవకతవకలపై చర్యలు తీసుకోవాలని, తమ డిమాండ్లను పరిష్కరించాలని వారు నినాదాలు చేశారు.

విద్యార్థుల మార్చ్‌ను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా బలగాలను మోహరించి పలు ప్రాంతాల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే కొందరు విద్యార్థులు బ్యారికేడ్లను దాటేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యానన్లను ప్రయోగించారు.

ఈ ఘటనలో పలువురు నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాట్నాలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. BPSC పరీక్షలో అక్రమాల ఆరోపణలపై విద్యార్థులు తమ ఆందోళనను కొనసాగిస్తుండటంతో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు