Today9TVNews ప్రతినిధి,
D రమేష్, మణుగూరు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రతి ఆహార వ్యాపార నిర్వాహకుడు FSSAI ఆహార లైసెన్స్ / రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా పొందాలని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ E. శరత్ సూచించారు.
ఆహార వ్యాపార నిర్వాహకులకు లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ పొందే ప్రక్రియను సులభతరం చేయడానికి 31.08.2026, సోమవారం రోజున ఆహార లైసెన్స్ & రిజిస్ట్రేషన్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వేదిక: రూమ్ నెం. F-3, IDOC, పాల్వంచ
హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలు, బేకరీలు, స్వీట్ షాపులు, కిరాణా దుకాణాలు, వీధి ఆహార విక్రయదారులు, ఆహార తయారీదారులు, హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారులు, ఇతర అన్ని Food Business Operators (FBOs) ఈ మేళాను సద్వినియోగం చేసుకుని తమ FSSAI లైసెన్స్ / రిజిస్ట్రేషన్ పొందాలని కోరారు.
“ప్రతి ఆహార వ్యాపారానికి FSSAI లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ ఉండటం చట్టబద్ధమైన బాధ్యత మాత్రమే కాకుండా, వినియోగదారులకు సురక్షితమైన మరియు నాణ్యమైన ఆహారం అందించడంలో ముఖ్యమైన భాగం” అని E. శరత్ తెలిపారు.
లైసెన్స్/రిజిస్ట్రేషన్కు సంబంధించిన సందేహాలు, FOSCOS పోర్టల్లో దరఖాస్తు
లైసెన్స్/రిజిస్ట్రేషన్కు సంబంధించిన సందేహాలు, దరఖాస్తు ప్రక్రియ తదితర విషయాలపై మేళాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తారని తెలిపారు.
కాబట్టి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రతి ఆహార వ్యాపార నిర్వాహకుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని FSSAI లైసెన్స్ / రిజిస్ట్రేషన్ పొందాలని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ E. శరత్ విజ్ఞప్తి చేశారు.









