మైసూర్ చాముండేశ్వరి అమ్మవారి సన్నిధిలో రామ్ చరణ్…

గ్లోబల్ స్టార్‌ రామ్‌ చరణ్‌ మైసూర్‌లోని చాముండేశ్వరి అమ్మవారి సన్నిధికి చేరుకున్నాడు. సోమవారం ఉదయం ఆలయానికి వెళ్లిన చరణ్‌ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, ప్రస్తుతం రామ్ చరణ్ మైసూర్‌లో జరుగుతున్న ‘గేమ్‌ ఛేంజర్‌’లో చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సినిమాకి శంకర్‌ దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram