భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : టుడే 9 ప్రతినిధి
పట్టణంలోని కూనవరం రోడ్డులో ఉన్న శ్రీవిద్య ప్రైవేటు పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న విద్యార్థిని టీచర్లు అమానుషంగా చితకబాది వాతలు వచ్చేలా చేశారని తల్లిదండ్రులు స్కూలు ఎదుట ఆందోళనకు దిగారు..రెండవ తరగతి చదువుతున్న చిన్నపిల్లవాడిని ఈ విధంగా దాడి చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని నిలదీసేందుకు వచ్చిన విద్యార్థి తల్లిదండ్రులకు కలవకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని యాజమాన్యంపై, తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు..విద్యార్థిని చితకబాదిన ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పలు విద్యార్థి సంఘాలు స్కూల్ వద్దకు చేరుకొని ధర్నాకు దిగారు..విద్యార్థులను భౌతికంగా దాడి చేసి వేధింపులకు గురి చేస్తున్న యాజమాన్యం పై క్రిమినల్ కేసులు ఫైల్ చేసి స్కూల్ లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.










