గోవా గవర్నర్గా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా అశోక్ గజపతి రాజు దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ ఆత్మీయ భేటీలో భాగంగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి ప్రతిమను ఆయన ప్రధానికి బహూకరించి సత్కరించారు.
సింహాచలం దేవస్థానం ట్రస్ట్ తరఫున సింహాద్రి అప్పన్న స్వామివారి దివ్య దర్శనానికి విచ్చేయాల్సిందిగా ప్రధాని మోదీని అశోక్ గజపతి రాజు సాదరంగా ఆహ్వానించారు. ఈ ఆహ్వానంపై ప్రధాని అత్యంత సానుకూలంగా స్పందిస్తూ, త్వరలోనే సింహాచలం వచ్చి స్వామివారిని దర్శించుకుంటానని గవర్నర్కు హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో ఆధ్యాత్మిక అంశాలతో పాటు గోవా రాష్ట్ర పాలనాపరమైన పురోగతిపై కూడా చర్చ జరిగింది. గోవాలో ప్రస్తుతం అమలవుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిగతులను అశోక్ గజపతి రాజు ప్రధాని మోదీకి సమగ్రంగా వివరించారు.









