భారత టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ జట్టులోకి తిరిగి వచ్చే అవకాశాలపై మరోసారి చర్చ మొదలైంది. కొలంబోలో జరిగిన ఓ కార్యక్రమంలో శ్రీలంక దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్యను కలిసిన సూర్య.. ఆయన ఫిట్నెస్ను చూసి సరదాగా ‘ఫిట్గా అవుతున్నారు.. మళ్లీ కమ్బ్యాక్కు ప్రయత్నిస్తున్నారా?’ అంటూ ప్రశ్నించాడు. దీనికి జయసూర్య చిరునవ్వుతో స్పందించగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అయితే ఈ సరదా సంభాషణకు మించి సూర్యకుమార్ రీఎంట్రీపై బీసీసీఐ వర్గాల నుంచి కీలక సమాచారం వెలువడినట్లు తెలుస్తోంది. టీమిండియా తలుపులు సూర్యకు పూర్తిగా మూసుకుపోలేదని, దేశవాళీ క్రికెట్లో వరుసగా పరుగులు సాధిస్తే అతడిని మళ్లీ జట్టులోకి ఎంపిక చేసే అవకాశం ఉందని ఓ బీసీసీఐ అధికారి పేర్కొన్నట్లు సమాచారం. దీంతో సూర్య అభిమానుల్లో ఆశలు చిగురించాయి.
2026 టీ20 ప్రపంచకప్లో భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించి టైటిల్ అందించాడు. అయితే ఆ తర్వాత అతడి బ్యాటింగ్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించారు. అనంతరం ఆటగాడిగా కూడా జట్టులో చోటు కోల్పోయాడు. ఇప్పుడు దేశవాళీ క్రికెట్లో సత్తా చాటితే మరోసారి టీమిండియా జెర్సీ ధరించే అవకాశం ఉందనే వార్తలు ఆసక్తి రేపుతున్నాయి.









