కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  ​భద్రాచలం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కుంటా శ్రీనివాస్ కు ఆత్మీయ వీడ్కోలు

​భద్రాచలం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కుంటా శ్రీనివాస్ కు ఆత్మీయ వీడ్కోలు

భద్రాచలం, మే 31: TODAY 9:

భద్రాచలం కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా గత రెండు సంవత్సరాలకు పైగా ఎంతో సమర్థవంతంగా, పారదర్శకంగా సేవలందించిన కుంటా శ్రీనివాస్  సాధారణ బదిలీలో భాగంగా జగిత్యాల కోర్టుకు వెళ్తున్న సందర్భంగా, భద్రాచలం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయనకు ఆత్మీయ వీడ్కోలు  సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
​ఈ కార్యక్రమంలో భద్రాచలం బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పూసాల శ్రీనివాసాచారి మాట్లాడుతూ, శ్రీనివాస్  భద్రాచలంలో తను అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా సేవలందించిన సమయంలో అసాధారణమైన పనితీరును ప్రదర్శించారని, క్లిష్టమైన కేసుల్లో కూడా ఎంతో పారదర్శకతతో వ్యవహరించి న్యాయ వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టారని కొనియాడారు. ఆయన వృత్తిపరమైన బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించి, అందరికీ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు.
​అనంతరం ఇతర సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ, శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులు ఎపిపి శ్రీనివాస్ కు ఎల్లప్పుడూ ఉండాలని, ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిష్టించి ప్రజలకు, న్యాయ వ్యవస్థకు మరింత విశిష్టమైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయనకు శాలువా కప్పి , పూలమాలలతో న్యాయవాదులందరూ కలిసి ఘనంగా సత్కరించారు.
​ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ సున్నం రమేష్, ప్రధాన కార్యదర్శి పూసాల శ్రీనివాసాచారి, జాయింట్ సెక్రటరీ తాతా లలిత, లేడీ రిప్రెసెంటేటివ్ ఎం. తరుణి, సీనియర్ న్యాయవాదులు కే. శ్రీమన్నారాయణ, గొడపర్తి నాగరాజు, సి.హెచ్.ఎన్. అంబేద్కర్, పామరాజు తిరుమలరావు, దాట్ల సంధ్య, సౌజన్య తదితర న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు