నామినేషన్ తిరస్కరణ అప్రజాస్వామికం: మంత్రి పొన్నం
కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ను తిరస్కరించడం పూర్తిగా అప్రజాస్వామికమని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. ముందస్తు నోటీసులు లేకుండా, కేసు వివరాలు చెప్పకుండా నామినేషన్ తిరస్కరించడం వెనుక బీజేపీ కుట్ర దాగి ఉందన్నారు. మహిళా సంక్షేమం గురించి మాట్లాడే బీజేపీ.. ఒక మహిళపై ఇలాంటి నిరంకుశ రాజకీయాలు చేయడం సరికాదని, న్యాయస్థానాలు వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.









