ఫీచర్ ఫోన్ల మార్కెట్‌లో సరికొత్త ట్రెండ్‌కు నోకియా శ్రీకారం..!

ఫీచర్ ఫోన్ల మార్కెట్‌లో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుడుతూ, హెచ్‌ఎండీ గ్లోబల్ నాలుగు కొత్త నోకియా బ్రాండెడ్ ఫోన్లను విడుదల చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో పనిచేసే ఈ ఫోన్లు, బేసిక్ మొబైల్ వినియోగదారులకు ఆధునిక సౌకర్యాలను అందించే లక్ష్యంతో మార్కెట్లోకి వస్తున్నాయి. నోకియా 200 4జీ, నోకియా 210 4జీ, నోకియా 215 4జీ సెకండ్ ఎడిషన్, నోకియా 235 4జీ సెకండ్ ఎడిషన్ పేరుతో ఈ నాలుగు మోడళ్లను కంపెనీ పరిచయం చేసింది.

 

ఈ ఫోన్ల ప్రధాన ఆకర్షణ వాటిలో పొందుపరిచిన ఏఐ అసిస్టెంట్. ‘సైకీ ఏఐ’ (Sikey AI) పవర్డ్‌తో పనిచేసే ఈ ఫీచర్‌ను యాక్సెస్ చేయడానికి ఫోన్ డీ-ప్యాడ్‌పై ప్రత్యేకంగా ఒక బటన్‌ను కేటాయించారు. ఈ బటన్ నొక్కి వాయిస్ కమాండ్స్ ద్వారా అలారం సెట్ చేయడం, టార్చ్ ఆన్ చేయడం, కాల్స్ మేనేజ్ చేయడం వంటి పనులు సులభంగా చేసుకోవచ్చు. అలాగే సాధారణ ప్రశ్నలకు సమాధానాలు కూడా పొందవచ్చు. సామాన్య వినియోగదారులకు టెక్నాలజీని మరింత చేరువ చేయడంలో ఇది కీలక ముందడుగుగా భావిస్తున్నారు.

 

ఈ బేసిక్ ఫోన్ల ఫీచ‌ర్లు ఇవే..

అన్ని ఫోన్లు S30+ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తాయి. 1,450 ఎంఏహెచ్ బ్యాటరీ, యూఎస్‌బీ-సీ చార్జింగ్ పోర్ట్, బ్లూటూత్ 5.0, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ఎఫ్‌ఎం రేడియో వంటి ఫీచర్లు అన్నింటిలోనూ ఉన్నాయి. వీటిలో అమర్చిన వీజీఏ కెమెరాల ద్వారా ‘ఎక్స్‌ప్రెస్ చాట్’ యాప్‌లో వీడియో కాలింగ్ కూడా చేసుకోవచ్చు. స్క్రీన్ పరిమాణాల్లో స్వల్ప తేడాలు ఉన్నాయి. నోకియా 210, 215 మోడళ్లలో 2.4-అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే ఉండగా, నోకియా 215, 235 మోడళ్లలో 2.8-అంగుళాల ఐపీఎస్ ప్యానెల్స్ ఉన్నాయి. నోకియా 235 4G మోడల్‌లో 2ఎంపీ రియర్ కెమెరాను కూడా అందించారు.

 

180 రోజుల తర్వాత ఏఐ సేవలకు సబ్‌స్క్రిప్షన్ అవసరం

అయితే, ఈ ఏఐ అసిస్టెంట్ సేవలు మొదటి 180 రోజుల వరకు మాత్రమే ఉచితం. ఆ తర్వాత సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా, ఈ పెయిడ్ సర్వీస్‌ను యాక్టివేట్ చేయడానికి స్మార్ట్‌ఫోన్ అవసరమని తెలుస్తోంది. వర్ధమాన దేశాల్లోని వినియోగదారులను, సింపుల్ ఫోన్లను ఇష్టపడేవారిని లక్ష్యంగా చేసుకుని ఈ ఏడాది మార్చిలో ప్రకటించిన వ్యూహంలో భాగంగానే హెచ్‌ఎండీ ఈ కొత్త ఫోన్లను తీసుకొచ్చింది. ఈ ఫోన్ల ధరలు, లభ్యత వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు