భూములు ఇచ్చేందుకు మేము సిద్ధమే ఆగస్టులో డబ్బులు పడతాయని చెప్పారు.. ఇప్పటివరకు డబ్బులు వేయలేదు… రైతు
Today9TVNews ప్రతినిధి,D రమేష్, మణుగూరు
మారెళ్ళ పాడు క్రింద భూములు కోల్పోయాం, ప్రాజెక్టుకు అడ్డం కాదు, ప్రాజెక్టుకు భూమి ఇచ్చేందుకు మీం సిద్ధంగా ఉన్నాం. ఆగస్టులో డబ్బులు పడతాయని చెప్పారు, ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి, కానీ నేటి వరకు నష్టపరిహారం డబ్బులు మాకు చెల్లించలేదు. దౌర్జన్యంగా భూమిని లాక్కొని పనులు చేస్తున్నారు.. రైతు…
నీళ్లు వదిలిన తర్వాత నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పడం దారుణం… రైతు
అశ్వాపురం మారెళ్ళ పాడు ప్రాజెక్టు కింద భూములు పోతే కౌలు కింద డబ్బులు ఇచ్చారు. ప్రాజెక్టు పూర్తయి నీళ్లు పారుదల జరిగితే నష్ట పరిహారం చెల్లిస్తామంటూ మంత్రి చెప్పడం దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబల్ ప్యాకేజీ ఇస్తామని చెప్పి పరిహారం చెల్లించకుండా పనులు చేసి రైతులని మోసం చేస్తున్నారని రైతు ఆరోపించాడు.









