నూతన పాఠశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే, తెల్లం,పిఓ.రాహుల్.

భద్రాద్రి కొత్త గూడెం జిల్లా :చర్ల నవంబర్ 19:టుడే 9 ప్రతినిధి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చింతగుప్ప గ్రామంలో నూతన పాఠశాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఐటిడిఏ పిఓ రాహుల్, .స్థానిక ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు,చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన , రిబ్బన్ కట్ చేసి, ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు, విద్యార్థులతో ఓ పాట ఆలపించి పిఓ, విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడుతూ,నేటి బాలల రేపటి పౌరులు క్రమశిక్షణతో పాటు చదువు విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలో నిలవాలని పేర్కొన్నారు.డీఈవో విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు ఆట వస్తువులు పంపిణీ చేశారు.విద్యార్థులతో కూర్చొని పిఓ ఎమ్మెల్యే స్థానిక అధికారులు భోజనం చేశారు.తదుపరి మండలంలోని పలు అభివృద్ధి పనులు, సమస్యల గురించి గ్రామ ప్రజలను ఆదివాసి నాయకులను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో డీఈవో, ఎంపీడీవో,ఇరిగేషన్ డిపార్ట్మెంట్,ఎమ్మార్వో, ఎంఈఓ, సెక్రటరీలు,పోలీస్ శాఖ, విద్యార్థులు,ప్రజా ప్రతినిధులు,మార్కెట్ చైర్మన్, చర్ల సొసైటీ చైర్మన్ దుర్గాప్రసాద్, ఉపాధ్యాయులు,గ్రామ పెద్దలు,ఆదివాసి నాయకులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram