మే 1 న జరిగే బిఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాన్ని జయప్రదం చేయండి…బిఆర్ఎస్ నాయకులు ఆకోజు సునీల్ కుమార్…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో
భద్రాచలం ఏప్రిల్ 29
టుడే 9 ప్రతినిధి

భారత రాష్ట్ర సమితి బిఆర్ఎస్ సమావేశం మే 1వ తేదీ నాడు దుమ్ముగూడెం మండలం లక్ష్మి నగరం గ్రామంలో జరుగుతుందని ఈ సమావేశానికి మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్. పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు భద్రాచలం నియోజకవర్గ పార్టీ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ మానే రామకృష్ణ హాజరవుతారు భద్రాచలం మండల పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని బిఆర్ఎస్ భద్రాచలం మండల పార్టీ నాయకులు ఆకోజు సునిల్ కుమార్ ఒక ప్రకటనలో కోరారు.
రానున్న పరిషత్ ఎన్నికల్లో పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు 420 హామీల అమలుకై ప్రభుత్వ విధానాలపై పోరాడేందుకు జరిగే ఈ విస్తృతస్థాయి సమావేశంలో మండల పార్టీ నాయకులు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ ద్వారా కొత్త మార్కెట్లో గల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి ఉదయం 9 గంటలకు ర్యాలీ ప్రారంభం అవుతుంది అధిక సంఖ్యలో పార్టీ అభిమానులు. కార్యకర్తలు. నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు