తాతోలు దుర్గాచారి ఉద్యోగ విరమణ. సిఐటియు- సిపిఎం ఆధ్వర్యంలో సన్మానం.

సిఐటియు, ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం

భద్రాద్రి కొత్త గూడెం జిల్లా బ్యూరో :భద్రాచలం మే 3
టుడే 9 ప్రతినిధి

ఉద్యోగ విరమణ అనంతరం తన శేష జీవితం ప్రజా ఉద్యమాలలో భాగస్వామ్యం కావాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ జె రమేష్ అన్నారు. తెలంగాణ ఆర్టీసీలో 38 సంవత్సరాల సుదీర్ఘకాలం ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందుతున్న తాతోలు దుర్గాచారి తన శేష జీవితం ప్రజా సమస్యలు, కార్మిక సమస్యలపై కృషి చేయాలని అన్నారు. దుర్గాచారి కవిగా, రచయితగా,
గాయకుడిగా సాహిత్య రంగంలో తన కృషిని కొనసాగించాలని అన్నారు. తాతోలు దుర్గా చారి కి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ సిపిఎం, సిఐటియు నాయకులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి, పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, సిఐటియు నాయకులు నకరికంటి నాగరాజు, అజయ్ కుమార్, కోరాడ శ్రీనివాస్, ఎం వి ఎస్ నారాయణ, బి జె ఎల్ పి దాసు, ముత్తయ్య, మురళీకృష్ణ,ఎస్ఎఫ్ఐ రవీందర్, రవి తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు