భద్రాచలం 05 జూన్ 26
*తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలలో ప్రవేశాలకు స్పాట్ కౌన్సిలింగ్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో. జూన్ 5
టుడే 9 ప్రతినిధి
2026-27 విద్యా సంవత్సరానికి గాను భద్రాద్రి కొత్తగూడెం . ఖమ్మం జిల్లాలలోని గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరంలో(Jr.inter) సీట్ల భర్తీ కొరకు స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించునట్లు ఐటీడీఏ పీవో బి రాహుల్ శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.
యు ఆర్ జె సి దమ్మపేట, కిన్నెరసాని డ్యాం సైట్, గుండాల బాలురు అలాగే యు ఆర్ జె సి భద్రాచలం, సుదిమల్ల బాలికలకు ఎంపీసీ బైపీసీ గ్రూపులలో సీట్లు ఖాళీగా ఉన్నాయని ఆయన అన్నారు.
కావున ఆసక్తి గల విధ్యార్ధినీ విద్యార్థులు మరియు ఇటీవలే పదవ తరగతి (2026-27 విద్యా సంవత్సరం) పూర్తయిన భద్రాద్రి మరియు ఖమ్మం జిల్లాలకు చెందిన గిరిజన విద్యార్థినీ విద్యార్థులు తప్పకుండ తమ ఒరిజినల్ సర్టిపికెట్లతో తేది: 15-06-2026. న ఉదయం 9.00 గంటలకు బాలబాలికలకు స్పాట్ కౌన్సెల్లింగ్ గిరిజన గురుకుల పాఠశాల(బాలికలు), భద్రాచలం వద్ద బాలురకు మరియు గిరిజన గురుకుల కళాశాల (బాలికలు) వద్ద బాలికలకు స్పాట్ అడ్మిషన్ ప్రక్రియకు హాజరు కాగలరని మరియు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని ఆయన కోరారు.









