అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావంతో బుధవారం దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. దేశీయంగా పసిడి ప్రియులకు వరుసగా మూడో రోజు కూడా ఈ తగ్గుదల ఊరటనిచ్చింది. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో రేట్లు వరుసగా దిగిరావడం కొనుగోలుదారులకు, వినియోగదారులకు పెద్ద ఉపశమనం కలిగిస్తోంది.
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, గుంటూరులలో పసిడి ధరలు గణనీయంగా తగ్గాయి. నిన్నటితో పోలిస్తే తులం (10 గ్రాములు) బంగారంపై దాదాపు రూ. 2,000 వరకు తగ్గింది. దీంతో బుధవారం మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల (మేలిమి) బంగారం ధర సుమారు రూ. 1,44,590 వద్ద ట్రేడ్ అవుతుండగా, ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,32,540 వద్దకు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,44,740 గా రికార్డయ్యింది.
బంగారంతో పాటే వెండి ధరలోనూ ఈరోజు భారీ క్షీణత కనిపించింది. మంగళవారంతో పోలిస్తే కిలో వెండిపై ఏకంగా రూ. 5,000 మేర దిగివచ్చి, ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 2,49,900 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా, ఈ రోజువారీ బిజినెస్ వార్తల్లోని ఇతర ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘బజాజ్ ఆటో’ పై సైబర్ నేరగాళ్లు రాన్సమ్వేర్ దాడికి పాల్పడినట్లు సమాచారం.









