భద్రాచలం జూన్ 29
టుడే 9 ప్రతినిధి
ఈరోజు రోస్టర్ విధానం వల్ల మాల, మాల ఉపకులాలకు జరుగుతున్న అన్యాయాన్ని నివారించాలని కోరుతూ మాలమహానాడు నాయకులు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
రోస్టర్ విధానం కారణంగా మాల, మాల ఉపకులాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఎస్సీ వర్గీకరణ అమలు నేపథ్యంలో మాలలకు కలుగుతున్న నష్టాన్ని ప్రభుత్వం పునఃసమీక్షించి న్యాయం చేయాలని కోరుతూ ఈరోజు మాలమహానాడు నాయకులు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రస్తుత రోస్టర్ విధానం అమలుతో మాల, మాల ఉపకులాలకు ఉద్యోగాలు, పదోన్నతులు మరియు ఇతర అవకాశాలలో తీవ్ర నష్టం జరుగుతోందని వివరించారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని నివారించేలా చర్యలు చేపట్టాలని కోరారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు నివేదిక పంపిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాలమహానాడు ఇంచార్జ్ దామాల సత్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడి పౌలరాజ్, కార్యదర్శి భుయ్యన వీరబాబు, వరద సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.









