MS Dhoni: IPL 2027లో ధోనీ ఆటగాడిగా కనిపించడంపై అనుమానాలు.. CSKతో కొత్త పాత్రలో కొనసాగుతారా?

టీమిండియా దిగ్గజం, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ భవిష్యత్తుపై మరోసారి చర్చ మొదలైంది. 45 ఏళ్ల వయసులో ఉన్న ధోనీ వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఆటగాడిగా కొనసాగుతాడా లేదా అనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే ప్రముఖ జర్నలిస్ట్ రోహిత్ జుగ్లాన్ చేసిన తాజా వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఊతమిచ్చాయి. ఐపీఎల్ 2027లో ధోనీని ఆటగాడిగా చూడటం కష్టమేనని, వచ్చే సీజన్‌లో అతడు బరిలోకి దిగకపోవచ్చని ఆయన పేర్కొన్నట్లు సమాచారం.

ధోనీ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, ఐపీఎల్‌లో సీఎస్‌కే తరఫున తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే వయసు, ఫిట్‌నెస్, జట్టు అవసరాలను పరిగణనలోకి తీసుకుని అతడి భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో 2027 సీజన్‌లో ధోనీ ఆటగాడిగా కనిపిస్తాడా లేదా అన్నది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.

అయితే ధోనీ పూర్తిగా సీఎస్‌కేకు దూరమయ్యే అవకాశం లేదనే చర్చ జరుగుతోంది. ఆటగాడిగా కాకుండా జట్టు సపోర్ట్ స్టాఫ్‌లో కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మెంటార్‌గా లేదా జట్టుకు సంబంధించిన మరేదైనా కీలక బాధ్యతలో ధోనీని కొనసాగించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ధోనీ ఏ హోదాలో సీఎస్‌కేతో కొనసాగుతాడనే దానిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు