కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  తీరం దాటిన తుపాను.. ఏపీలో భారీ వర్షాలు.. పంటలకు తీవ్ర నష్టం..

మిగ్‌జాం తుపాను తీరం దాటేసింది. ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల సమీపంలో తీరాన్ని దాటింది. ఈ విషయాన్ని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. తీరం దాటిన ‘మిగ్‌జాం’ బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశముందన్నారు. బాపట్ల తీర ప్రాంతంలో భారీ ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. సముద్రంలో అలలు సుమారు రెండు మీటర్ల మేర ఎగసిపడుతున్నాయి.

 

తుపాను ప్రభావంతో ఏపీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా పలు తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలు, ఈదురుగాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో పంటలకు తీవ్ర నష్టం జరుగుతోంది. నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో నష్టం ఎక్కువగా జరుగుతోంది. రాయలసీమలోనూ తుపాను ప్రభావం ఉంది. వరి, పొగాకు, పసుపు, అరటి పంటలు నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు పడిపోయాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు