స్టార్ హీరోయిన్ సమంత తన పుట్టినరోజును అభిమానుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్లో జరిగిన ఈ వేడుకలో ఆమె ఫ్యాన్స్తో కలిసి కేక్ కట్ చేశారు. దర్శకుడు రాజ్ నిడిమోరుతో వివాహం తర్వాత ఆమెకు ఇది తొలి పుట్టినరోజు కావడం, అలాగే చాలా కాలం తర్వాత సమంత తన అభిమానులతో నేరుగా సమయం గడపడం ఈ వేడుకకు మరింత ప్రత్యేకతను తీసుకువచ్చింది.
అభిమానుల మధ్య ఎంతో ఆనందంగా కనిపించిన సమంత, వారితో సరదాగా మాట్లాడుతూ ఫొటోలకు పోజులిచ్చారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైన తర్వాత అభిమానులతో ఆమె ఇలా మమేకం కావడం పట్ల ఫ్యాన్స్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా సమంతకు సినీ పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. నయనతార, వరలక్ష్మి శరత్కుమార్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి పలువురు తారలు ఆమెకు విషెస్ తెలిపారు. ఇదే సమయంలో సమంత నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న ఫ్యామిలీ యాక్షన్ కామెడీ చిత్రం ‘మా ఇంటి బంగారం’ మే 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నట్లు స్పష్టం చేశారు.









