గాజాలో శాంతి కోసం కొత్త అడుగు.. బలగాలను పంపేందుకు సిద్ధమైన ఆఫ్రికా దేశాలు

గాజాలో శాంతిభద్రతల పరిరక్షణకు అంతర్జాతీయ స్థాయిలో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించడంతో పాటు కాల్పుల విరమణను అమలు చేసేందుకు ప్రతిపాదించిన ‘ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్’లో భాగస్వామ్యం కావడానికి ఆఫ్రికా దేశాలు ముందుకు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఉగాండా, బురుండి దేశాలు తమ సైనిక బలగాలను గాజాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఈ ప్రతిపాదనపై ఆయా దేశాలతో చర్చలు కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ అమలు, ప్రాంతీయ స్థిరత్వం కోసం ఈ బలగాలు కీలకంగా పనిచేసే అవకాశం ఉంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో రూపొందిన ‘బోర్డ్ ఆఫ్ పీస్’ ప్రణాళికలో భాగంగా ఈ ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గాజాలో శాంతి, భద్రతలను పునరుద్ధరించేందుకు అంతర్జాతీయ సహకారాన్ని పెంచడమే ఈ ప్రతిపాదన ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే బలగాల మోహరింపు, వారి విధులు, ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share