భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం మే 19
టుడే 9 ప్రతినిధి
భద్రాచలంలోని ఐటీడీఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియంలో పొందుపరిచిన కళాఖండాలు చాలా అద్భుత ఉన్నాయని, గిరిజన అభివృద్ధి కొరకు పాటుపడడమే కాక వారి సంస్కృతిని ప్రతిబింబించేలా మ్యూజియం రూపకల్పన చేసిన ఐటీడీఏ బి రాహుల్ ను అభినందిస్తున్నట్లు గిరి దర్శక్ రోల్ టూరిస్ట్ గైడ్ ఉబ్బమోహన్రావు అన్నారు.
మంగళవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్ లో పౌర రక్షక శాఖ ఆధ్వర్యంలో గిరిదర్శక్ శిక్షణ పొందుతున్న గిరిదర్శక్ బృందం టూరిస్ట్ గైడ్ సభ్యులు శిక్షణలో భాగంగా గిరిజన మ్యూజియంను సందర్శించారు. మ్యూజియంలోని ఆదివాసీలకు సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలను మరియు కళాకృతులను గిరిజన క్రాఫ్ట్ తయారీ విధానాన్ని వారు పరిశీలించినారు. మారుమూల ఆదివాసి గిరిజనుల యొక్క పురాతన వస్తువులను సేకరించి ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు భావితరాలకు తెలిసే విధంగా మ్యూజియంలో పొందుపరచడం చాలా బాగుందని ఆనందం వ్యక్తం చేశారు. ఆహార సేకరణకు ఉపయోగించే వస్తువులు నీళ్లకు ఉపయోగించే సొరకాయతో చేసినటువంటి సొరకాయ బుర్రలు బాగున్నాయని, ఆదివాసులు ఆధునిక పోకడలకు పోకుండా పర్యావరణాన్ని కాపాడే వస్తువులను నిత్యజీవితంలో ఉపయోగించుకోవాలని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మ్యూజియం ఇన్చార్జి వీరాస్వామి,మాధవి, స్రవంతి, సందీప్ కుమార్, ఉదయ్ కుమార్, రవి, ముత్యాలరావు, దేవా, వర్ష సందీప్, అపక సాంబ తదితరులు పాల్గొన్నారు.









