జగన్ కేసులపై సుప్రీంకోర్టు దృష్టి సారించాలి.. బెయిల్ రద్దు చేయాలి: జ్యోతుల నెహ్రూ డిమాండ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బెయిల్‌ను వెంటనే రద్దు చేయాలని జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. జగన్‌పై ఉన్న అక్రమాస్తుల కేసులపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రత్యేక దృష్టి సారించాలని, ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి విచారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో వైసీపీ నాయకులు వరుసగా అఘాయిత్యాలకు, అరాచకాలకు పాల్పడుతున్నారని జ్యోతుల నెహ్రూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నెలకొన్న ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో జగన్ బెయిల్‌ను న్యాయస్థానాలు ఎందుకు రద్దు చేయకూడదని ఆయన సూటిగా ప్రశ్నించారు.
బాధితులను పరామర్శించే పేరుతో జగన్ ప్రజలను రెచ్చగొడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు. పరామర్శల చాటున శవరాజకీయాలు చేస్తూ సమాజంలో విద్వేషాలు పెంచేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి వివాదాస్పద వైఖరిపై కోర్టులు కఠిన చర్యలు తీసుకోవాలని నెహ్రూ కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు