కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ కీలక భేటీ.. కేసీఆర్ ఎక్కడ..?

తెలంగాణలో ఎన్నికల ఫలితాల వెలువడిన తర్వాత సీఎం కేసీఆర్ ఎక్కడా కనిపించలేదు. కాంగ్రెస్ కు ఘన విజయం సాధించగానే సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను తన ఓఎస్డీ ద్వారా పంపించారు. ఆ తర్వాత ఆయన సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫాంహౌస్ కు వెళ్లిపోయారని ప్రచారం జరుగుతోంది.

 

తాజాగా హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశమయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షతన ఈ భేటీ కొనసాగుతోంది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఎన్నికల ఫలితాలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తున్నారు.

 

బీఆర్ఎస్ ఓటమి తర్వాత జరుగుతున్న ఈ సమావేశానికి పార్టీ అధినేత కేసీఆర్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక పార్టీ బాధ్యతలు తనయుడు కేటీఆర్ కే అప్పగిస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు