సింగరేణి సేవా సమితి వృత్తి శిక్షణా తరగతులను పరిశీలించిన డిజిఎం(పర్సనల్) వెల్ఫేర్ కేసా నారాయణ రావు.
భద్రాద్రి కొత్త గూడెం జిల్లా : సింగరేణి నవంబర్ 21:
టుడే 9 ప్రతినిధి
సింగరేణి సేవా సమితి ద్వారా సింగరేణి గృహీణులతో పాటు పరిసర ప్రాంత మహిళలకు వృత్తి శిక్షణ తరగతుల ద్వారా మహిళలు ఆర్ధికంగా ఎదగాలనే ఉద్దేశం తో 2025-26 ఆర్ధిక సంవత్సరం లో నిర్వహిస్తున్న సింగరేణి సేవా సమితి కార్పొరేట్ ఏరియా బాబుక్యాంప్, ఎన్.కే.నగర్ ఏరియా సేవాసెంటర్ లో నిర్వహిస్తున్న ఉచిత మగ్గం వర్క్, టైలరింగ్ శిక్షణా తరగతులను డిజిఎం(పర్సనల్) వెల్ఫేర్ కేసా నారాయణ రావు పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఇస్తున్న శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని ఆర్ధికంగా ఎదగాలని, ముఖ్యంగా ఈ యొక్క వృత్తి విద్యా కోర్సులకు క్రమం తప్పకుండా హాజరవుతూ శ్రద్దగా నేర్చుకోవాలని కోరారు. .

ఈ కార్యక్రమం లో డిజిఎం(పర్సనల్) వెల్ఫేర్ కేసా నారాయణ రావుతో పాటు కమ్మ్యూనికేషన్ ఆఫీసర్ ఎన్.సుజ్ఞాన్, సేవా కొ-ఆర్డినేటర్ ఇజాజ్ షరీఫ్, సేవా సెక్రటరీ బి.మాధవీ స్వర్ణలత, శిక్షకులు స్వాతి, పద్మావతి మహిళలు పాల్గొన్నారు.









