శ్రీ చైతన్య స్కూల్ పేరుపై అనుమానాలు? – ఉస్మానియా విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీ రామ్. కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్!

  సీఎం పర్యటన ఏర్పాట్లు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: నవంబర్ 21: టుడే 9 ప్రతినిధి

డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎట్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రానున్న సందర్భంగా ఏర్పాట్ల పురోగతిని శుక్రవారం పరిశీలించి, వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.యూనివర్సిటీ ప్రాంగణం మొత్తం ముఖ్యమంత్రి పర్యటనకు అనుగుణంగా తీర్చిదిద్దే పనుల్ని కలెక్టర్ విభాగాల వారీగా పరిశీలిస్తూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ ఆడిటోరియం, హాస్టల్ బ్లాక్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లు, అంతర్గత రహదారుల మరమ్మత్తు, వంటి కీలక ప్రదేశాలను సందర్శించి, పనుల పురోగతిపై ఇంజనీరింగ్ మరియు యూనివర్సిటీ అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రతీ పని వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఆలస్యానికి కారణమయ్యే అంశాలు ఏవైనా ఉంటే వెంటనే నివేదించాలని, తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.యూనివర్సిటీ మొత్తం పరిశుభ్రత మరియు పచ్చదన సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ,ప్రతి విభాగాన్ని అందంగా మార్చేందుకు ఎంపీడీవోలను ప్రత్యేక విభాగాలకు కలెక్టర్ నియమించారు. గ్రౌండ్ లెవెలింగ్, మొక్కలు నాటడం, రోడ్ల పక్కన హార్టికల్చర్ పనులు, చెత్త తొలగింపు వంటి సుందరీకరణ కార్యక్రమాలు తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన రోజున యూనివర్సిటీ ఒక ఆదర్శవంతమైన విద్యాసంస్థగా కనిపించాలనే లక్ష్యంతో పనుల్ని అమలు చేయాలని ఆయన సూచించారు.
ముఖ్యమంత్రి పర్యటనలో ఏలాంటి లోపాలు లేకుండా, ప్రణాళిక బద్ధంగా పని చేయాలన్న దిశగా విద్యుత్, నీటి వసతులు, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, మీడియా ఏర్పాట్లు, వసతి సదుపాయాలు వంటి అన్ని విభాగాలు పరస్పరం సమన్వయంతో వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పర్యటన విజయవంతం కావాలంటే ప్రతి శాఖ సమిష్టిగా పనిచేయాలని, అన్ని ఏర్పాట్లు ప్రభుత్వ ప్రతిష్ఠకు తగ్గట్టుగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా పరిపాలన పూర్తిస్థాయి సమన్వయంతో పని చేసి, సకాలంలో అన్ని పనులు పూర్తి చేయాలని, ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి అని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు.ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగన్మోహన్ రాజు, మున్సిపల్ కమిషనర్ సుజాత, డిపిఓ అనూష, పంచాయతీరాజ్ ఈ ఈ శ్రీనివాస్, ఎంపీడీవోలు కళాశాల ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు