కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  రాజుపేట లో సైడ్ డ్రైన్ నిర్మాణం పనులను వెంటనే పూర్తి చేయాలి…

  • రాజుపేట లో సైడ్ డ్రైన్ నిర్మాణం పనులను వెంటనే పూర్తి చేయాలి.
  • నిర్మాణానికి ఆటంకంగా ఉన్న కట్టడాలను తొలగించాలి.
  • గ్రామపంచాయతీ ఈ.వో.కు వార్డు ప్రజల వినతి.
  • ఆటంకాలను తొలగించి సైడ్ డ్రైన్ నిర్మాణం పూర్తి చేస్తాం ఈ.వో హామీ.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో.

భద్రాచలం మే 9
టుడే 9 ప్రతినిధి

భద్రాచలం గ్రామపంచాయతీ అభివృద్ధి నిధులలో భాగంగా 20వ వార్డు పరిధిలో ఎమ్మెల్యే కాలనీలో ఐదు లక్షల రూపాయలతో చేపట్టిన డ్రైన్ నిర్మాణ పనులకు ఆటంకంగా మారిన కట్టడాలను వెంటనే తొలగించి డ్రైన్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని సిపిఎం 20వ వార్డ్ మెంబర్ ఇరప అనసూయ ఆధ్వర్యంలో వార్డు ప్రజలందరూ గ్రామపంచాయతీ ఈవో ను కలిసి వినతి పత్రం సమర్పించారు.. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ అభివృద్ధి పనులకు వచ్చే ఆటంకాలను తొలగించి సైడ్ డ్రైన్ నిర్మాణo పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి లు మాట్లాడుతూ వార్డు అభివృద్ధికి ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని అన్నారు. సిపిఎం గెలిచిన వార్డుల నందు అభివృద్ధి పనులు పారదర్శకంగా జరిగేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాలుగో వార్డ్ మెంబర్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బండారు శరత్ బాబు, పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు డి. సీతాలక్ష్మి, సీనియర్ నాయకులు, పార్టీ పట్టణ కమిటీ సభ్యులు నాదెళ్ల లీలావతి, డి. కనక శ్రీ, హైమావతి, బేగం, లక్ష్మీనారాయణ,పద్మ, సముద్రల రమణ,భషీర్,మల్లూరు,శ్రీదేవి,తదితరులు పాల్గొన్నారు.

*నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాను.
*సిపిఎం 20 వార్డు మెంబర్ ఇరప అనసూయ.
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని సిపిఎం 20 అవార్డు మెంబర్ ఇరప అనసూయ అన్నారు. వార్డు పరిధిలోని సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. వార్డు అభివృద్ధి నిధులలో భాగంగా రాజుపేట లో సైడ్ డ్రైన్ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, భూదేవి నగర్ శివారులో సైడ్ డ్రైన్ నిర్మాణానికి 4 లక్షల రూపాయలు, ఎంపీ కాలనీలో లక్ష రూపాయలు నిధులు కేటాయించి పనులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. రాజుపేట లో సైడ్ డ్రైన్ నిర్మాణం కు ఆటంకంగా ఉన్న అక్రమ కట్టడాలను తొలగించి అభివృద్ధి పనులు సజావుగా జరిగేటట్లు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.. వార్డు పరిధిలోని ప్రజలు తమ దృష్టికి ఏ సమస్య తీసుకువచ్చిన వెంటనే స్పందించి కృషి చేస్తున్నానని అన్నారు.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, ఇతర సమస్యలు పై తమ దృష్టికి తీసుకువస్తే అధికారుల సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు..

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు