కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  డిగ్రీ కళాశాల లో సి యస్ ఆర్ డోనర్స్. ..ఇతర దాతలకు సన్మానం….

 

భద్రాచలం మే 17
టుడే 9 ప్రతినిధి

ప్రభుత్వ డిగ్రీ కళాశాల భద్రాచలం అటానమస్ నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 11 నుంచి 17 వరకు జరిగిన విద్యా వారోత్సవాలలో భాగంగా చివరి రోజు సి యస్ ఆర్ డోనర్స్, ఇతర దాతల సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జాన్ మిల్టన్ అన్నారు.
ఆదివారం నాడు కళాశాలలో చివరి రోజు జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెంగల్ రావు డీజీమ్ ఐటీసీ , పాల్గొని కళాశాల అభివృద్ధి,వసతులు కల్పనలో ఐటిసి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వాటర్ కూలర్లు అందించిన రోటరీ క్లబ్ తరఫున డి . వి . కె నాయుడు, కంప్యూటర్ ప్రింటర్ ను అందించిన సిపిడిసి మెంబర్ జి . శంకర్రావు, కళాశాలలో పూల కుండీలు,మొక్కలు అందించిన మాగంటి వెంకటేశ్వరరావు, బి . విశ్వనాథ్ అసిస్టెంట్ హెచ్ ఆర్ మేనేజర్ ఐ టి సి పాల్గొని విద్యార్థుల విద్యాభివృద్ధికి, సదుపాయాల కల్పనకు తమ సహకారం ఉంటుందని తెలియజేశారు. కళాశాలలో చదివి చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగాలు సంపాదించిన వారిని ఈ కార్యక్రమంలో భాగంగా అభినందించి, సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపక అధ్యాపకేత్ర బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు