ప్రజా సమస్యలపై పవన్ స్పందన అద్భుతం: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ప్రశంసలు కురిపించారు. ప్రజా సమస్యలపై ఆయన స్పందిస్తున్న తీరు ఎంతో అద్భుతంగా ఉందంటూ కూటమి ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ రెండేళ్ల పదవీ కాలం పూర్తయిన సందర్భంగా శేష్ ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. రాజకీయ నాయకులకు ప్రజల పట్ల స్పందించే హృదయం ఉండాలని, ఆ మంచి లక్షణాలు పవన్ కల్యాణ్లో పుష్కలంగా కనిపిస్తున్నాయని కొనియాడారు.
సమస్యల తక్షణ పరిష్కారం: పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన కొన్ని సంఘటనలను అడివి శేష్ ఈ వీడియోలో ప్రస్తావించారు. నెల్లూరు జిల్లా గజ్జలవారిపల్లెలో విద్యార్థులు ఎదుర్కొంటున్న రోడ్డు సమస్యపై సోషల్ మీడియాలో వచ్చిన వీడియో అందరికీ చేరేలోపే, పవన్ కల్యాణ్ తక్షణమే స్పందించి పరిష్కారం చూపించారని గుర్తుచేశారు. అలాగే చిలకలూరిపేట శారదా హైస్కూల్ పర్యటనలో విద్యార్థులు కోరిన వెంటనే కంప్యూటర్లు, లైబ్రరీ సౌకర్యాలను కల్పించిన తీరును శేష్ అభినందించారు.
ఆయన పాలన ఇలాగే సాగాలి: తన కెరీర్ ప్రారంభం నుండి పవన్ కల్యాణ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఇప్పుడు ఆయన ఒక గొప్ప లీడర్గా ఎదగడం ఆనందంగా ఉందని అడివి శేష్ పేర్కొన్నారు. ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న డిప్యూటీ సీఎంకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు మేలు చేసే ఈ సుపరిపాలన ఇలాగే కొనసాగాలని అడివి శేష్ ఆకాంక్షించారు.









