కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  ఘనంగా మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి…

 

భద్రాచలం మే 21
టుడే 9 ప్రతి నిధి

భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కునవరం రోడ్ లో గల రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద మహానేతకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన భద్రాచలం గ్రామపంచాయతీ సర్పంచ్ పూనెం కృష్ణ ఉపసర్పంచ్ రత్నం కవిత. కాంగ్రెస్ పార్టీ నాయకులు.మాట్లాడుతూ దేశ సమగ్రత, శాంతి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జీవితాన్ని అంకితం చేసిన నాయకుడని స్మరించుకున్నారు.రాజీవ్ గాంధీ వర్ధంతిని దేశవ్యాప్తంగా “ఉగ్రవాద వ్యతిరేక దినం”గా పాటిస్తున్న సందర్భంగా ప్రతి భారతీయుడు హింసకు వ్యతిరేకంగా, శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. “సమైక్యతే మన శక్తి – శాంతియుత భారతమే మన లక్ష్యం” అన్న దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రత్నం రమాకాంత్, కొండిశెట్టి కృష్ణమూర్తి, బొంబోతుల రాజీవ్, నర్రా రాము, అరికెల్ల తిరుపతి రావు, భీమవరపు వెంకటరెడ్డి, చుక్కా సుధాకర్, దుద్దుకురి సాయిబాబా, దరపునేని రాంబాబు, పడిసిరి శ్రీనివాస్, చింతాడి రామకృష్ణ, గుండెపెల్లి హనుమంతురావు, ఎండి భషీర్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ గాడి విజయ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆకుల వెంకట్, యూత్ కాంగ్రెస్ మండల కార్యదర్శి మాచినేని భాను, ఏలురి రాము , మహిళలు ములకలపల్లి మదారి తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు