కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  వైఎస్ షర్మిలకు నిరాశ.. దక్కని కర్ణాటక రాజ్యసభ టికెట్!

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కర్ణాటక నుంచి రాజ్యసభకు పోటీ చేయబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా జోరుగా సాగిన ఊహాగానాలకు తెరపడింది. కాంగ్రెస్ అధిష్ఠానం తాజాగా ప్రకటించిన రాజ్యసభ అభ్యర్థుల తుది జాబితాలో ఆమెకు చోటు దక్కలేదు. కర్ణాటక నుంచి ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలను భర్తీ చేసే క్రమంలో.. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ముగ్గురు అభ్యర్థుల పేర్లను అధికారికంగా ఖరారు చేసింది.

హైకమాండ్ ప్రకటించిన వివరాల ప్రకారం కర్ణాటక కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేడా, మరియు కేంద్ర మాజీ మంత్రి రెహ్మాన్ ఖాన్ కుమారుడు మన్సూర్ ఆలీ ఖాన్‌లకు అవకాశం లభించింది. ఈ ముగ్గురిలో మల్లికార్జున్ ఖర్గే ఈరోజు తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య సహా పలువురు కీలక నేతలు హాజరుకానున్నారు.

మరోవైపు, రాజ్యసభ ద్వారా పార్లమెంట్‌లో అడుగుపెట్టాలని భావించిన వైఎస్ షర్మిలకు ఈసారి కూడా నిరాశే ఎదురైంది. పొరుగు రాష్ట్రం కర్ణాటక కోటా నుండి ఆమెను పెద్దల సభకు పంపుతారని అనుచరులు భావించినప్పటికీ, అధిష్ఠానం సమీకరణాలు మారడంతో ఆమెకు టికెట్ దక్కలేదు. దీంతో షర్మిల అనుచరులు, కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు