హైదరాబాద్ లో డెలివరీ బాయ్స్ తో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. స్విగ్గీ, జొమాటో, ఊబర్, ఓలా, డంజో సిబ్బందితో మంత్రి సమావేశమయ్యారు. వేతనాలు, సంక్షేమ బోర్డు, ఇతర అంశాల గురించి చర్చించారు. వారికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని.. బీమా, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.