కొడంగల్ నియోజకవర్గం తనకు అస్థిత్వాన్ని ఇచ్చిందని.. పోరాటాన్ని నేర్పిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ’20ఏండ్లు రైతులు, విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన పోరాడా.. ఈ కొడంగల్ గడ్డ నా అడ్డా.. మీ బిడ్డ, మీరు నాటిన మొక్క. మీరు పెంచిన ఈ చెట్టును నరికేందుకు కేసీఆర్, మోడీ భుజాన గొడ్డలి వేసుకుని బయలుదేరిండ్రు.. కొడంగల్ సాక్షిగా చెబుతున్నా.. కేసీఆర్కు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించడం ఖాయం. రాష్ట్రంలో దొరల, గడీల పాలన పోవాలి.. ఇందిరమ్మ రాజ్యం రావాలి.’ అని అన్నారు.









