హైదరాబాద్ నగరంలో ప్రధాని మోదీ రోడ్ షో ప్రారంభమైంది. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ప్రారంభమైన రోడ్ షో 3 కిలోమీటర్లు సాగనుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి నారాయణ గూడ, వైఎంసీఏ చౌరస్తా నుంచి కాచిగూడ క్రాస్ రోడ్ మీదుగా యాత్ర సాగనుంది. ప్రధాని చూసేందుకు బీజేపీ శ్రేణులతో పాటు ప్రజలు భారీ సంఖ్యలో రోడ్ల మీదకు వచ్చారు. కాగా, 3 రోజులుగా తెలంగాణలో ప్రధాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు.









