కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య బీమా పథకం ప్రధానమంత్రి ఆరోగ్య యోజన- ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాల పేరును మార్పు చేసింది. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను ‘ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్’గా మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసినట్లు అధికారిక వర్గాలు ఆదివారం తెలిపాయి.









